calender_icon.png 31 January, 2026 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించండి

31-01-2026 12:00:00 AM

నామినేషన్ స్వీకరణ కేంద్రంను సందర్శించిన కలెక్టర్

భూత్పూర్, జనవరి 30 : మున్సిపాలిటీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రం ను కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం సందర్శించారు. నామినేషన్ స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయా? అని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శుక్రవారం చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నందున, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.

అభ్యర్థులు, అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తు.చ తప్పక పాటించాలని అన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువు లోపు బీ ఫారం సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక అధికారులు ఉన్నారు.