04-06-2025 06:28:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ... రైతుల భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం నుంచి మొదలైన భూభారతి రెవెన్యూ సదస్సులో ఇప్పటివరకు ఆయా మండలాలలోని 25 గ్రామాలలో ఇప్పటివరకు 1100 కు పైగా దరఖాస్తులు రైతుల నుంచి స్వీకరించడం జరిగిందని అన్నారు. రైతులపై ఎవరైనా దౌర్జన్యం చేసిన, దురుసుగా ప్రవర్తించిన సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.