calender_icon.png 6 June, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత

04-06-2025 06:29:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు మాగం రంగారెడ్డి కన్నుముశారు. బుధవారం ఉదయం మాగం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రికిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రంగారెడ్డి అంత్యక్రియలను గురువారం శామీర్ పేటలో నిర్వహించనున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ కోటా కింద ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకునే బాధ్యతను మాగం రంగారెడ్డి నిర్వహించారు. రంగారెడ్డి మరణంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.