11-06-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10(విజయ క్రాంతి):ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సు ల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తెలిపారు. మంగళవారం కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి రెవె న్యూ సదస్సు సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
రెవెన్యూ సద స్సులలో అందిన దరఖాస్తులను పరిశీలించి రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వతంగా సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దుర్గానగర్ లో కొనసాగుతున్న భూభారతి సదస్సును సంద ర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మధుకర్, ఉపతహసిల్దార్ సరిత, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.