11-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 10 (విజయకాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శుల సమస్యలను పరిష్కరిం చి ప్రభుత్వం పనులు తగ్గించాలని, నిధుల ను విడుదల చేయాలని జిల్లా గ్రామ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీలకు ప్రభు త్వం అభివృద్ధి నిధులను విడుదల చేయకపోవడంతో ప్రతినెల తమ సొంత జేబు ఖర్చు లను పెట్టుకుంటున్నామని దీనివల్ల ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు పని ఒత్తిడిని రోజురోజుకు పెంచడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి విన్నవించారు. అనం తరం డిమాండ్లతో కూడిన వినతి పతాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి విన్నవించారు ఈ కార్యకమంలో సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, లక్ష్మణ్రాజు, వర్మ సురేందర్, నితీష్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.