మంచిర్యాల, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ సుమతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కే శివలీల, సెగ్మెంట్ కో ఆర్డినేటర్ రజిత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.