హనుమకొండ, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని అదాలత్ వద్ద శుక్రవారం నిర్వహించిన మానవహారంలో ఆమె మాట్లాడారు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ను విజయవంతం చేయాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, రాధికా గుప్తా, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -