calender_icon.png 25 November, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు కాంగ్రెస్ ద్రోహం

25-11-2025 01:05:16 AM

  1. అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం
  2. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి
  3. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గళమెత్తాలి
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  5. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ తెలంగాణ భవన్‌లోఎమ్మెల్సీ దాసోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అంశంతోపాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంపైన ఆ పార్టీని ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చి న హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు.

సో మవారం తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్నారు.

తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెల ంగాణలో ఇచ్చినట్లు  దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్‌గాంధీ చేస్తు న్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో ఈ అంశం పైన చర్చకు వచ్చేలా చూడాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్‌గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తరు అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి నిజంగానే బీసీలపైన, 42 శాతం రిజర్వేషన్ల అంశం పైన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో గళం లేవనెత్తాలన్నారు. బీజేపీ పదేపదే బీసీల మాట చెబు తుంది కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకొని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షే మశాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని అన్నారు.

స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతగానో ప్రయోజనం చే కూర్చే విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. దీంతోపాటు బీసీలకు బడ్జెట్‌లో సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో 20వే ల కోట్ల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ర్టంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా కుల వృత్తుల కు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారని, వారంతా కేసీఆర్ వెంటే ఉన్నార ని ధీమా వ్యక్తంచేశారు.

మాజీమంత్రి, ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసా న్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలియజేశారు. ఈ కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాష్, మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నే ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.