27-05-2025 12:44:05 AM
- ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల యత్నం
- అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు
- పగిలిపోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటం
- ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ
- పోలీసుల లాఠీచార్జ్, పలువురు నేతల అరెస్టు
సిరిసిల్ల, మే 26 (విజయక్రాంతి): సిరిసిల్లలో సోమవారం ఉద్రిక్త వాతావ రణం నెలకొంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు తరలివెళ్లారు.
వారిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, పలువురిని అరెస్టు చేశారు. స్థానికంగా నెలకొన్న ప్రొటోకాల్ రగడ దీనంతటికీ కారణమని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చం దంగా ఇరు పార్టీల నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఘర్షణ వాతావరణానికి తెరలేపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టడంలేదని, ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో పెట్టాల్సిందేనని లేదంటే అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని ఓ బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా వేదికగా సవాలు విసిరారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో లేదని, క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెడతామం టూ అదే సోషల్ మీడియా వేదికగా ఓ కాంగ్రెస్ నేత సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయా నికి సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంది. ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తుల య్యారు.
ముందే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితులు చేయి దాటడంతో ఇరు పార్టీల నేతలపై లాఠీచార్జ్ చేశారు. అయినా సద్దుమనుగకపోవడంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులతో పాటు పలువురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.