calender_icon.png 23 June, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వచ్చిందే అబద్ధాల పునాదులపై

16-05-2025 01:33:17 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై వచ్చిందని, ప్రజలనే కాకుండా కోర్టులనూ తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు. గురు వారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలనకు ఏడాదిన్నర గడిచినా ఇంకా బీఆర్‌ఎస్‌పై బురదచల్లుతూ కాలం గడు పుతు న్నారని విమర్శించారు. గత ప్రభుత్వంపై పదికి పైగా ఎంక్వైరీలు వేశారని, ఎక్కడా ఏం రుజువు చేయలేకపోయారన్నారు.