calender_icon.png 23 June, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి

16-05-2025 01:33:35 AM

-అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు 

- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయానని, దీంతో ప్రయివేట్ కళాశాలలు, యజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపో యాయని, అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని గురువారం సీఎంకు రాసిన లేఖలో కేంద్రమంత్రి వెల్లడించారు.

ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశా లలు మూతపడ్డాయని, ప్రభుత్వం ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాల మధ్య గొడవలు జరిగి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసులు పెట్టుకుంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలన్నీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని ఒకసారి, 12 వాయిదాల్లో చెల్లిస్తామని మరోసారి చెప్పిన మాటలను మర్చిపోయారా? అని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తును, యాజమాన్యాల మనుగడను దృష్టిలో పెట్టుకొ ని తక్షణమే బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.