04-06-2025 11:02:48 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్(Corporator Baba Fasiuddin) కంటతడి పెట్టుకున్నారు. బోరబండకు చెందిన మొహమ్మద్ సర్దార్ మృతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫసియుద్దీన్ వాపోయారు. సర్దార్ చావుకు తాను కారణమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనపై కుట్ర చేశారని ఆరోపించారు. సర్దార్ ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్టు ఇచ్చారు.. కానీ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని మాగంటి గోపినాథ్ దుష్ప్రచారం చేస్తున్నారని బాబా ఫసియుద్దీన్ తెలిపారు. బోరబండకు చెందిన భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) నాయకుడు మొహమ్మద్ సర్దార్ ఐదు రోజుల క్రితం బాబా ఫసియుద్దీన్, ఇతరుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలున్నాయి. సోమవారం రాత్రి, కాంగ్రెస్ నాయకుడు, TMREIS చైర్మన్, ఫహీమ్ ఖురేషి, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్, ఇతర కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.