04-06-2025 11:28:07 AM
హైదరాబాద్: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) కౌన్సిల్ సమావేశం బుధవారం ప్రారంభం అయింది. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపు కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి నూతన కమిషనర్ ఆర్వీ కర్ణన్ తొలిసారి హాజరయ్యారు. తరచూ జీహెచ్ఎంసీ కమిషనర్ల బదిలీలపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గళ మెత్తనున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 1,327 కోట్ల నిధులు మంజూరు చేసింది. హెచ్ సిటీ ప్రాజెక్టు, శానిటేషన్, వర్షాకాల సన్నద్ధతపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశముంది. ప్లకార్డులతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు లోనికి తీసుకెళ్లవద్దని బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు వారించారు.