28-06-2025 01:07:02 AM
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ, జూన్ 27: భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నేతలు పాటించరని విదేశాంగ శాఖ మం త్రి జైశంకర్ శుక్రవా రం పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏండ్లు పూర్తయి న సందర్భంగా భారతీయ జన తా యువ మోర్చా (బీజేవైఎం) ఆ ధ్వర్యంలో ఢిల్లీలో మాట్లాడారు. కాం గ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ‘ఎమర్జెన్సీ వల్ల అనేక మంది జైళ్లల్లో మగ్గాల్సి వచ్చింది. కాంగ్రెస్ హ యాంలో అవినీతి పెరిగిపోయి..
ద్ర వ్యోల్బణం ఎక్కువవడం వల్ల ప్రభుత్వానికి ప్రజాదరణ కరువైంది. అందుకే ఎమర్జెన్సీ విధించారు. దేశ పౌరులు, పత్రికల ప్రాథమిక హ క్కులను ప్రభుత్వం నిలిపివేసింది. కొంద రు రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజల్లో తిరుగుతారే తప్పా.. రాజ్యాంగాన్ని పా టించరు. చేసిన తప్పుల గురించి కాంగ్రెస్ ఎన్నడూ విచారం వ్యక్తం చేయదు.21 నెలల ఎమర్జెన్సీ కాలం లో ఎవరి ఆమోదం లేకుండా నే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.’ అని పేర్కొన్నారు.