22-02-2026 02:23:17 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): గిగ్ వర్కర్ల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లను కార్మికులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర స్థౠయిలో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా వర్తింప చేయాలని కోరారు.