17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

18-11-2025 12:00 AM

పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ 

రేగోడు, నవంబర్ 17: నిరుపేదల సొంతింటి కలలను నెరవేర్చిన ఘనత కాం గ్రెస్ ప్రభుత్వానిదని పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్ అన్నారు, సోమవారం మం డలంలోని గజవాడ గ్రామం లో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లుతో పాటు పంచాయతీ పరిధిలోని తండాలో ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని పూర్తి చేసుకున్న వారి ఇల్లుకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని ని రుపేదలందరూ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో సీతారావమ్మ, కార్యదర్శి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.