18-06-2025 06:30:42 PM
మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆవరణంలో మండల అధ్యక్షులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్(Former ZPTC Teegala Tirumala Goud) మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పధకం క్రింద పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడం, రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... రైతు భరోసా పథకం క్రింద డబ్బులు జమ అవుతాయని ప్రకటించి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ వుంటుందని ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ యావత్ రైతాంగానికి తీపి కబురు అందించి రైతులకు ఆర్థ ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వానాకాలం పంట సాగు ప్రారంభానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు.
దోమకొండ మండలంలో 8659 పాస్ బుక్కులు ఉండగా 6852 ఎకరముల పంట సాగు చేయడం జరుగుతుందని, 8 కోట్ల 22 లక్షల 29 వేల 621 రూపాయల రైతు భరోసా నిధులలో నుండి ఖాతాల్లో జూన్ 25 తారీఖున 9 రోజులలో రైతుల ఖాతల్లో పడతాయని తెలిపారు. కొత్త పాసు బుక్కులు ఉన్నాయో జూన్ 21 వరకు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్లి నమోదు చేసుకుంటే వాళ్లకు కూడా రైతు భరోసా వస్తాయని మాట్లాడారు.
దోమకొండ మండలంలో గల గ్రామాలలో 2 లక్షల 50వేల 633 వందల బస్తాల వరి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని ,సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని సందర్భంగా తెలిపారు. సకాలంలో పంట పెట్టుబడి సాయం అన్నదాతకు అందించడం ద్వారా విత్తనాలు, ఎరువులు వ్యవసాయపు అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు.
జిల్లా రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, టీ పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సీతారామ మధు, చాముండేశ్వరి ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, ఆలయ ధర్మకర్త ఎల్లం రాములు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.