18-06-2025 06:33:26 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): తన రక్తంతో గీసిన చిత్రపటాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)కు అందజేసిన కాంగ్రెస్ యువ నాయకులు నవీన్ యాదవ్. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా యువ నాయకుడు తన రక్తం తీసి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాన్ని గీయించి బుధవారం హైదరాబాదులో మంత్రిని కలిసి మంత్రి చిత్రపటాన్ని బహూకరించిన మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు కాట్రేవుల నవీన్ యాదవ్ మంత్రిపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు.