8 March, 2026 | 3:30 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

18-06-2025 06:25 PM

ఘట్ కేసర్: ఏకశిలా నగర్ వెంచర్ వివాదంకు సంబంధించిన రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. పోచారం మున్సిపల్ లోని ఏకశిలా నగర్ వివాదంకు సంబంధించి పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకశిలా వెంచర్ తో పాటు సంస్కృతి టౌన్ షిప్ అప్రోచ్ రోడ్డును సందర్శించారు.

అనంతరం ఏకశిలా వెంచర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... వారం రోజుల్లో హర్ష కన్ స్ట్రక్షన్స్ యజమాని వెంకటేష్, ఏకశిలా వెంచర్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇరువురి వద్ద ఏ డాక్యుమెంట్లు ఉన్న పూర్తి ఆధారాలతో రావాలన్నారు. హైకోర్టు ఉత్తర్వులు (స్టేటస్కో) ఏమైనా ఉంటే న్యాయ నిపుణులతో చర్చిస్తామని, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.