22 August, 2026 | 2:52 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

కొండా సురేఖ మారని పార్టీ లేదు.. తిట్టని నాయకుడు లేడు

22-08-2026 02:15 PM

మీ బిడ్డ మాట్లాడితే మీకు బాధ్యత ఉండదా?

కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే చర్యలు తప్పవు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యల(Konda Susmitha's comments) వివాదం కొనసాగుతోంది. తన కూతురుతో పాటు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ లు డిమాండ్ చేశారు. శనివారం నాడు విప్ లు ఆదిశ్రీనివాస్, విజయరమణరావు, రామచంద్రనాయక్, ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ నిర్వహించారు. గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

మీ బిడ్డ మాట్లాడితే మీకు బాధ్యత ఉండదా? అని విప్ విజయరమణారావు(Whip Vijayaramana Rao) ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్  చేశారు. కొండా సురేఖ వివరణతో పార్టీ సంతృప్తి చెందకపోతే పదవి నుంచి తొలగిస్తారని విప్ విజయ రమణారావు స్పష్టం చేశారు. అవసరమైతే ఎలాంటి చర్య తీసుకోవడానికైనా పార్టీ వెనుకాడదని తేల్చిచెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కొండా సురేఖకు సొంత జిల్లా నాయకులతో కూడా సఖ్యత లేదని ఆరోపించారు. కొండా సురేఖ మారని పార్టీ లేదు.. తిట్టని నాయకుడు లేడని విప్ లు విమర్శించారు. సీఎం వచ్చేలోపు కొండా సురేఖ క్రమశిక్షణాకమిటీని కలిసి ఉంటే తెలంగాణ సమాజం కొంత క్షమించి ఉండేదని విప్ లు పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సూచించారు. కొండా సురేఖ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.