20 March, 2026 | 4:58 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్

20-01-2025 08:03 PM

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు...

ఇల్లెందు (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరి ప్రియ ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెంకట్యతండా సమీపంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బేతంపూడి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశానికి వారు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలోని 138 పంచాయితీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఓట్లు అడిగేందుకు కూడా కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్కినేని సురేందర్ రావు, దిండిగాల రాజేందర్, నాయకులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు, చీమల సత్యనారాయణ, బానోత్ కిషన్, బానోత్ రామ, భూక్యా లాలునాయక్, తేజావత్ రవి తదితరులు పాల్గొన్నారు.