27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

భద్రాద్రి జిల్లాలో హైటెన్షన్...

02-11-2025 11:07 AM

హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మణుగురులోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న  ఫర్నిచర్ కు నిప్పంటించి పార్టీ ఆఫీసు ఆవరణలోని ఫ్లెక్సీలు చింపేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా, గద్దెను ధ్వంసం చేశారు. అనంతరం ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.  పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.