30-06-2025 04:10:57 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ నాయకులు స్వరూప-రాజ్ కుమార్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళకి సొంత ఇంటి కల నెరవేర్చలేదని. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు.