14 July, 2026 | 5:00 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు

14-07-2026 04:21 PM

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం: అనంతుల మధు

చివ్వెంల,(విజయక్రాంతి): పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన "చలో సచివాలయం ముట్టడి" కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, డీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్‌ను చివ్వెంల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అనంతుల మధు మాట్లాడుతూ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసినా తమ సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్యార్థులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయకుండా సమస్యలపై ప్రశ్నించే వారిపై ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.