16 April, 2026 | 10:31 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కుంటకట్ట కబ్జాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు

27-11-2025 12:24 AM

తూప్రాన్, నవంబర్ 26 :తూప్రాన్లోని అవుసుల కుంటకట్ట ఆక్రమణకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మామిళ్ళ కృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా కుంటలు, చెరువుల పైన కొరడా ఝుళిపించిందని గుర్తు చేశారు.

కొందరు పనిగట్టుకొ ని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తూప్రాన్ ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులకు తక్షణమే కుంటకట్టను యధాస్థితికి తీసుకురావాలని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధి రాములు గౌడ్, విశ్వరాజ్, కొడిప్యాక నారాయణ గుప్తా, పిట్ల సిద్ధిరాములు, బొల్లు నాగులు, ఉమర్, అజయ్ పాల్గొన్నారు.