calender_icon.png 4 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం

04-02-2026 12:00:00 AM

కోదాడ, ఫిబ్రవరి 3: కోదాడ మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 11, 21, 31 వార్డుల కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేవరపల్లి మల్లేశ్వరి, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, ఎర్నేని కుసుమ బాబులు ఏకగ్రీవమైనట్లు కమిషనర్ రమాదేవి మంగళవారం తెలిపారు. ఆయా వార్డుల నుంచి మిగతవారు నామినేషన్ల ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచినవారు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మూడు కౌన్సిలర్ స్థానాలకు ఏకగ్రీవం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొన్నది. మిగతా వార్డుల్లో విజయదుందుభి మోగించాలని కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విలూరుతున్నారు.