06-06-2025 01:05:00 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలం పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెలకల జితేందర్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జితేందర్ ను కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండలం అధ్యక్షులు దొడ్డ బాలాజీ శుక్రవారం పరామర్శించారు. జితేందర్ ఆరోగ్యం పరిస్థితి పై మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శ్రీను బాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని త్వరలోనే జితేందర్ కోలుకుంటాడని బాలాజీ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.