06-06-2025 01:07:06 PM
బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని, పేదలకు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(Mahabubabad MLA Bhukya Murali Naik) అన్నారు. ఆచార్య జయశంకర్ బడిబాట ర్యాలిని భూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన, అటల్ టింకరింగ్, ల్యాబ్ వంటి అత్యాధునికమైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఉన్న పేద ప్రజల పిల్లలకి నాణ్యమైన విద్యా బోధన చేయడంతో పాటు వసతి గృహాల్లో డైట్ చార్జీలు పెంచి వారికి అన్ని విధాలుగా అందుకుంటూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.