calender_icon.png 7 June, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోళ్లలో మంథని పీఏసిఎస్ రికార్డ్ బ్రేక్

06-06-2025 01:03:29 PM

  1. పెద్దపల్లి జిల్లాలోనే గత ఐదేళ్లలో మంథని  పీఏసిఎస్ ద్వారా అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు        
  2. ఈసారి 4.26లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణ      
  3. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి...      
  4. మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలులో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్దపల్లి(Peddapalli district) జిల్లాలోనే రికార్డ్ స్థాయి ధాన్యం కొనుగోళ్లు జరిపి పాత రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. జిల్లాలోనే మంథని పీఏసిఎస్ అధికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ గత ఐదేళ్లలో అత్యధిక స్థాయిలో కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. ఈసారిమంథని పీఏసిఎస్ 4లక్షల 26వేల 860 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మంథని సహకార సంఘం కార్యాలయంలో సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ,  రైతులను దళారుల భారి నుంచి ధగా పడకుండా కాపాడేందుకు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో సహకార సంఘాల ద్వారా ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సహకార సంఘాల పటిష్ట అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని అన్నారు.

అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి, ప్రస్తుత ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సహకారంతో గ్రామగ్రామానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరూ ఇప్పించి రైతుల ముంగిట్లోనే కల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈసారి పక్కా ప్రణాళిక తో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు జరిపామని అన్నారు.  రైస్ మిల్లర్లు గతంలో క్వింటాళ్ కు రెండు మూడు కిలోల ధాన్యం కోత విధించేవారని, ఈసారి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మిల్లర్లు ధాన్యంలో ఒక్క గింజ కూడా కోత విధించకుండా చూశామన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ఈసారి ప్రశాంతంగా కొనుగోళ్లు జరిపామన్నారు. ఈ రబీ సీజన్ లో సంఘం పరిధిలో నిర్వహిస్తున్న (35) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో సహకార సంఘం ద్వారా అత్యధికంగా ధాన్యం కొనుగోల్లు జరుపుతూ జిల్లాలో టాప్ లో నిలుస్తున్నామని తెలిపారు. రభీ 2021 సీజన్ లో 32 కేంద్రాలు నిర్వహించి 4414 మంది రైతుల నుంచి ౩లక్షల 64వేల031 క్వింటాళ్ళు సేకరించి రూ.68 కోట్ల 70 లక్షల70వేల612 వ్యాపారం చేశామని తెలిపారు. ఖరీఫ్ 2021-22 సీజన్ లో32 కేంద్రాలు 4844 మంది రైతులు 3లక్షల 19వేల879 క్వింటాళ్ళు సేకరించి 62కోట్ల31లక్షల95వేల424 వ్యాపారం చేశామని, రభీ 2022 సీజన్ లో 32 కేంద్రాలు నిర్వహించి 2649 మంది రైతుల నుంచి 1లక్ష 79వేల476 క్వింటాళ్ళు సేకరించి 35కోట్ల17లక్షల40వేల816 వ్యాపారం చేశామని, ఖరీఫ్ 2022-23 సీజన్ లో34 కేంద్రాలు 5009 మంది రైతులు 3లక్షల 48వేల044 క్వింటాళ్ళు సేకరించి 71కోట్ల34లక్షల11వేల740 వ్యాపారం చేశామని,  రభీ 2023 సీజన్ లో 33 కేంద్రాలు నిర్వహించి 3820 మంది రైతుల నుంచి 3లక్షల 63వేల360 క్వింటాళ్ళు సేకరించి 74కోట్ల28లక్షల80వేల560 వ్యాపారం చేశామని, ఖరీఫ్ 2023-24 సీజన్ లో33 కేంద్రాలు 3117 మంది రైతులు నుంచి2లక్షల 28వేల932 క్వింటాళ్ళు సేకరించి 46కోట్ల97లక్షల17వేల232 వ్యాపారం చేశామని, రభీ 2024 సీజన్ లో 37 కేంద్రాలు నిర్వహించి 5109 మంది రైతుల నుంచి 3లక్షల 68వేల248 క్వింటాళ్ళు సేకరించి, 75కోట్ల40లక్షల55వేల408 వ్యాపారం చేశామని, ఖరీఫ్ 2024-25 సీజన్ లో35 కేంద్రాలు నిర్వహించి5216 మంది రైతులు నుంచి 3లక్షల 69వేల823 క్వింటాళ్ళు సేకరించి 85కోట్ల13లక్షల19వేల511 వ్యాపారం చేశామని, ఈ రభీ 2025 సీజన్ లో 35కేంద్రాలు నిర్వహించి 5148 మంది రైతుల నుంచి 4లక్షల 26వేల860 క్వింటాళ్ళు సేకరించి రూ.98కోట్ల46లక్షల11వేల472 వ్యాపారం చేశామని తెలిపారు.

ఈ రభీ సీజన్ లో విజయవంతంగా కొనుగోళ్లు జరిగేలా సహకరించిన ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, పౌర సరఫరాల శాఖ డిఎం, డిసిఎస్ఓ, జిల్లా మార్కెటింగ్ అధికారి, సహకార శాఖ అసిస్టెంట్ రిజిష్ట్రార్ బి.నరేష్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు, సంఘ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, హమాలీలు, సంఘ సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ పాలకవర్గ సభ్యులు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.