calender_icon.png 4 June, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన

02-06-2025 10:09:20 PM

జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామారావు..

సూర్యాపేట (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు(District Library Association Chairman Vangaveeti Rama Rao) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు యానాల యాదగిరి రెడ్డి, మాజీ కౌన్సిలర్ పెండెం చంద్రశేఖర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వి శ్యాంసుందర్ రెడ్డి, లైబ్రరియన్ కే. విజయభాస్కర్, గ్రంథాలయ సిబ్బంది గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు