పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్లో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీపీసీసీ కార్యదర్శి సానెం శ్రీనివాస్గౌడ్, మేయర్ లత, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు టింకు రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నాయకులు లంకల సంజీవ్, డప్పు నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.