రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 3న సిరిసిల్లలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి తెలిపారు. సీఎం పర్యటనకు సంబందిం చిన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభావేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరా రు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.