1 July, 2026 | 10:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కాంగ్రెస్‌ది తుగ్లక్ పాలన

12-06-2024 02:19 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో సోమ్ డిస్టిలరీస్ సంస్థ మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్లీ పుట్టి పాలన సాగిస్తున్నాడనే అనుమానం కలుగుతున్నదని ఎద్దేవా చేశారు. సోమ్ డిస్టిలరీస్ విషయంలో మంత్రి జూపల్లి అనుసరించిన వైఖరి ఆక్షేపణీయమని విమర్శించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే రకరకాల వైఖరుల తీసుకుని చివరకు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. అవినీతి కంపెనీకి రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.