4 April, 2026 | 2:27 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

13-02-2026 04:38 PM

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Telangana Municipal Election Results) వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 59 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలు గెలుచుకుంది. 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. మరో 10 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ ముందంజలో ఉన్నది. రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్ లో ఉత్కంఠ నెలకొంది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టాడు. రీకౌంటింగ్ లో సమాన ఓట్లు రావడంతో అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు. బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ఆధిక్యంలో దూసుకుపోతుంది.  భైంసాలో 26 వార్డులకు 12 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. భైంసాలో 6 వార్డుల్లో బీజేపీ, 7 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. భైంసా మున్సిపాలిటీలో 1 వార్డులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విక్టరీ కొట్టింది. మొత్తం 48 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ 27 గెలిచింది. బీఆర్ఎస్‌-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, 2 స్వతంత్రులు గెలిచారు.