15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కోదాడ మునిసిపల్ చైర్మన్ పీటం ఎవరిని వరిస్తుందో

15-02-2026 07:06 PM

మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

కోదాడ: కోదాడ మునిసిపల్ చైర్మన్ పీటం ఎవరిని వరిస్తుందోనని పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో ఎంపిక ప్రక్రియపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ పీటం కోసం ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు, పారా సత్యవతి సీతయ్య, దేవరపల్లి మల్లీశ్వరి గుండప్పనేని పద్మావతి నాగేశ్వరరావుతోపాటు మైనారిటీ అభ్యర్థిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమార్తె షేక్ నేహా పోటీలో ఉన్నారు.

కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా హైదరాబాద్ లోని క్యాంపుకు తరలించారు. కౌన్సిలర్లందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. చైర్మన్ పదవి ఎవరికి కేటాయించినా, వైస్ చైర్మన్ పదవిని బలహీన సామాజికవర్గాలకు కేటాయించే ఆచారం కొనసాగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయోనని కోదాడ పట్టణంలో చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో కొత్త కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగనుండడంతో ఉత్కంఠకు తెరపడనున్నది.