calender_icon.png 30 May, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కుట్ర

26-05-2025 01:03:22 AM

- తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం

- లేకుంటే సీడబ్ల్యూసీ ముందు ధర్నా చేస్తాం: హరీశ్‌రావు

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మిగులు జలాలని చంద్రబాబు చెబుతున్నా, అవి  గోదావరి మిగులు జలాలు కావన్నారు.

వాటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోకపోవటం వల్లే,ఆ నీళ్లు కిందకు వెళ్తున్నాయన్నారు. ఇదంతా తెలిసినా రాష్ర్ట ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి, 8 మంది ఎంపీలు బిజేపీ నుంచి గెలిచి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.

రాష్ట్రప్రభుత్వం అధికారులతో ఉత్తరాలు రాయించి, చేతులు దు లుపుకోవడం కాదని.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కా ర్యాచరణ ఉండాలన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏ ర్పా టు చేయడంతో పాటు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరి చి బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలన్నారు.

ఎంపీలు సైతం పార్లమెంట్‌లో గట్టిగా నిలదీయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ తరఫున పెద్దఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధమవుతామన్నారు. కిష న్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు. గో దావరి మీద ట్రిబ్యునల్ వే యాలని ఏపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింద ని, ఆ ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్ల నిర్మించి, ప్ర జాధనం ఖర్చయిందని చె ప్పి 200 టీ ఎంసీలు నీళ్లు కేటాయించుకొనేందుకు పథకం ప్రకారం కుట్రలు చే స్తున్నారని ఆరోపించారు.

అపెక్స్ కౌ న్సిల్, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాళేశ్వరం ని ర్మాణం చేపడుతున్నారంటూ చంద్రబాబు తెలంగాణపై అక్కసు వెల్లగక్కారని, భక్తరామదాసు లిఫ్ట్, పాలమూరు సహా అనేక ప్రా జెక్టులను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేశారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదని, ప్రాణహితకు కొ నసాగింపు అని వాస్తవం చెప్పి కేంద్రం నుంచి అనుమతి సాధించామన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? విభజన చట్టం ప్రకారం, కేఆర్‌ఎంబీ లేదా జీఆర్‌ఎంబీ అనుమ తి తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లో బనకచర్లకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరమన్నారు.