15 June, 2026 | 3:01 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఫోన్ ట్యాపింగ్‌లో నన్ను ఇరికించే కుట్ర

05-07-2024 01:20 AM

ఎమ్మెల్సీ నవీన్ కుమార్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో నాపై చేసిన ఆరోపణలు అవాస్తమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కావాలని పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని, ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులతో నాకు సంబంధం ఉన్నట్టు ఓ పత్రిక లో కథనం వచ్చిందని వారితో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలనే పేరు తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. దర్యాప్తు  అధికారు లు ఈవ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి నిజా నిజాలు తెలుసుకోవాలని కోరారు.