23 March, 2026 | 3:07 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

ఫోన్ ట్యాపింగ్‌లో నన్ను ఇరికించే కుట్ర

05-07-2024 01:20 AM

ఎమ్మెల్సీ నవీన్ కుమార్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో నాపై చేసిన ఆరోపణలు అవాస్తమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కావాలని పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని, ప్రణీత్‌రావు, శ్రవణ్‌రావులతో నాకు సంబంధం ఉన్నట్టు ఓ పత్రిక లో కథనం వచ్చిందని వారితో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలనే పేరు తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. దర్యాప్తు  అధికారు లు ఈవ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి నిజా నిజాలు తెలుసుకోవాలని కోరారు.