calender_icon.png 6 May, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

03-05-2025 10:12:39 PM

ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు...

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. శనివారం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు, వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు, ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.