14-06-2025 12:20:20 AM
కామారెడ్డి, జూన్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బి ఆర్ ఎస్ భవన్ వద్ద తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స పొంది ఇంటికి రావడంతో కామారెడ్డి నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాదు వెళ్లి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి కి వెళ్లి కామారెడ్డి పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, భిక్కనూరు మండల నాయకులు మహేం దర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాసుల లక్ష్మీనారాయణ, గరిగంటి లక్ష్మీనారాయణ, సంగి మోహన్, లడ్డూరికృష్ణ యాదవ్, పట్టణ యువత అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ తదితరులు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు.