01-06-2025 12:00:37 AM
- జెడ్సి హేమంత్ భోర్కడేను కోరిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, మే 31: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కొరకు శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే ఐ.ఏ.ఎస్ వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.
అనంతరం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గుడా,నేతాజీ నగర్,రాయదుర్గం,నల్లగండ్ల హుడా కాలనీలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్న పాటి వర్షానికి గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తక్షణమే నూతన రోడ్లు వేయించాలని అలాగే గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జనాభా దృశ్య రోడ్డు వెడల్పు కూడా చేయవలసిన అవసరం ఉందని జోనల్ కమిషనర్ ను కోరారు. దీనికి జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ భోర్కడే సానుకూలంగా స్పందించి పనులపై తక్షణమే అంచనా వేసి తగిన నిధుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.