01-06-2025 12:01:59 AM
ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): జాతీయ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (ఏపీ, టిఎస్) ఉపాధ్యక్షులుగా సైకం మనోహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జి. కరుణాకర్ రెడ్డి తన కార్యాలయంలో నియమక పత్రాన్ని అందజేశారు.
అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మనోహర్ రెడ్డి గత ఐదెండ్ల నుంచి వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో పాటు వాక ర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారన్నారు. రెడ్డి సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో ఈ పదవిలో నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేద రెడ్డి సమస్యలతో పాటు ఓసీలో జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రెండు రాష్ట్రాలలో రెడ్డి కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి నిరుపేద రెడ్డిలను అదుకో వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు సలిపెల రమేష్ రెడ్డి పాల్గొన్నారు.