calender_icon.png 9 June, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాస్పదమైన ప్రైవేట్ పాఠశాల ప్రారంభం

09-06-2025 12:42:06 AM

గిరిజనుల నిరసన, వెనక్కి తిరిగిన ఎమ్మెల్యే 

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అన్ని హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆదివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. పాఠశాల భవనాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే కారులో వస్తుండగా పెద్ద ఎత్తున గిరిజనులు అడ్డు తగిలారు.

రహదారిపై బైఠాయించి తమ స్థలం కబ్జా చేసి పాఠశాలను నిర్మించారని ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, అటువంటి పాఠశాలను ప్రారంభించడం వల్ల ఈ ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీనితో ఎమ్మెల్యే పాఠశాలను ప్రారంభించకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పాఠశాల నిర్మాణ వివాద అంశాన్ని అధికారులు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.