9 April, 2026 | 2:48 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం

09-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసు పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలు హాజరు పట్టిక పరిశీలించారు, పలు అంశాలపై ఆరా తీశారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వైద్యులు సేవా అందించాలని రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవస్థ చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ గోపాల్ సింగ్, వైద్యులు శారద తాసిల్దార్ రాజు ఉన్నారు.