calender_icon.png 2 June, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతీ రెవెన్యూ సదస్సు-2025 విజయవంతం చేయాలి

31-05-2025 11:12:35 PM

తహసీల్దార్ శివకృష్ణ...

నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో జూన్ 3 నుంచి 19 వరకు  రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శివ కృష్ణ(Tahsildar Shiva Krishna) శనివారం ఒక ప్రకటన తెలిపారు. ఆర్ఆర్ చట్టంలో ఉద్దేశించి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మండల రెవెన్యూ అధికారులు రెండు టీములుగా ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.

మొదటి టీం తహసీల్దార్ శివ కృష్ణ రెండవ టీం గిర్దావర్ హనుమంత్ రెడ్డి టీం లీడర్ గా వ్యవహరిస్తారని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులు ఇదివరకు దరఖాస్తు చేసిన భూభారతిలో ఆన్లైన్లో పెండింగ్ ఉన్నవాళ్లు కాకుండా మిగతా కొత్తవాళ్లు కొత్త పాసుబుక్ రాని వాళ్లు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సమస్యలను కమిటీలకు రాతపూర్వకంగా అందజేయాలని తెలిపారు.