పాఠశాల పరిశుభ్రతకు సహకరించిన కౌన్సిలర్ సౌజన్య
పెబ్బేరు మార్చి 5: మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో కౌన్సిలర్ వల్లపు రెడ్డి సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో తన సొంత ఖర్చులతో స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థుల క్రీడ ప్రాంగణం సౌకర్యార్థం క్రీడ ప్రాంగణాన్ని కంపచెట్లు తొలగించి బుల్లోజర్ తో క్రీడా ప్రాంగణాన్ని చదును చేయించి మరియు టాయిలెట్స్ పునర్నిర్మాణం చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పుల్లపరెడ్డి సౌజన్య మాట్లాడుతూ.. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రేదగా చదువుకుంటారని సూచించారు. కార్యక్రమంలో టీచర్స్ జి నరసింహ గౌడ్, మండ్ల కురుమూర్తి, మౌనిక, ఎం జయ, మణెమ్మ,సాయి గీత, బాలమని, అరుణ కుమారి, వాణిశ్రీ,డి కృష్ణయ్య, ఏం నరసింహ,డి బిసన్న, జీ రవి, మరియు బసాల వెంకటేశ్వర రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, సురేష్, సదానందం, సత్యనారాయణచారి, పాల్గొన్నారు.




