28-06-2025 12:48:11 AM
తెలంగాణగ్రామపంచాయతీ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి శంకర్
చండూరు,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కు వెళుతున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ లలో నిర్భందించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామపంచాయతీ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి నాంపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా చలో హైదరాబాద్ ధర్నాకు వెళుతున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని,పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చిన కనీస చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. . ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో గ్రామపంచాయతీ యూనియన్ ఉపాధ్యక్షులు నాగిళ్ల లక్ష్మణ్, యూనియన్ నాయకులు ఈరటి శ్రీశైలం, ఇస్తారి, మల్లయ్య, రాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.