05-06-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
గజ్వేల్, జూన్ 4: ఆర్థిక, సామాజిక అంతరాలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గత వంద సంవత్సరాలుగా పనిచేస్తుందని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. బుధవారం సీపీఐ పార్టీ గజ్వేల్ మండల 17వ మహాసభ నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు బట్టు దయానందరెడ్డి గారు పార్టీ పతాకావిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు.
ముఖ్య అతిధి జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ ఈ దేశంలో పీడితుల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై మేధావులపై ఉప చట్టాలను ప్రయోగిస్తూ జైలులో నిర్బంధిస్తున్నారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడం కోసం పాలక ప్రభుత్వాలను ప్రశ్నించనంత మాత్రాన ఈ దేశంలో ఉండకూడదనే ముద్ర వేస్తున్నారన్నారు.
మహిళలను మోసం చేసిన బ్యాంకు అధికారులు మహిళా సంఘ ఆర్పీ దాని వెనుక ఉన్న అధికారులెవరినైనా ప్రభుత్వం శిక్షించాలని కోరారు. జిల్లా అధికారులు దీనిపై పూర్తి విచారణ చేసి డబ్బులను రికవరీ చేయాలని అధికారులను కోరారు. సిపిఐ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు బట్టు దయానంద రెడ్డి మాట్లాడుతూ పార్టీని అన్ని గ్రామాలలో నిర్మాణం చేయడం కోసం ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త అహర్నిశలు పనిచేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టాపురం లక్ష్మణ్, ఎడల వనేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, శివలింగు కృష్ణ, జేరిపోతుల జనార్ధన్, నరసింహారెడ్డి, రామగల్ల నరేష్ ,హమాలీ సంఘం నాయకులు లక్ష్మణ్, కానుగుల రమణాకర్, మిట్టపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మహాసభ అనంతరం గజ్వేల్ మండల, పట్టణ నూతన కౌన్సిల్ ను ఎన్నుకున్నారు.
గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శిగా శివలింగు కృష్ణ, సహాయ కార్యదర్శిలుగా కొండకింది పోచయ్య, మొట్ట శ్రీను, గజ్వెల్ పట్టణ కార్యదర్శిగా సర్గం రాజేశం, సహాయ కార్యదర్శిగా కానుగుల రమనకర్, కౌన్సిల్ సభ్యులుగా బొట్ల సాయి, పిట్ల ఎల్లం, కొరమైన నర్సింలు, దాసరి యాదయ్య, ఉప్పరి యాదగిరి, గూడూరు బలనర్సయ్య ఎన్నికయ్యారు.