05-06-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, జూన్ 4 (విజయక్రాంతి):ప్రజాపాలన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 50 వ డివిజన్ హంటర్ రోడ్డు, విష్ణు ప్రియ గార్డెన్స్ విద్యుత్ నగర్ లో రూ.15 లక్షలతో కాలనీలో అంతర్గత రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను శంకుస్థాపన, నీలిమ జంక్షన్ నుంచి తెలంగాణ జంక్షన్ వరకు రూ.43.00 లక్షలతో నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అంతక ముందు స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కాలనీ వాసులు జంక్షన్ వెడల్పు చేయాలని కోరగా అధికారులు వాటిని పరిశీలించి కావాల్సిన అనుమతులు, విది విధానాలను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.