28-06-2025 10:00:39 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేయాలని, ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు.
శనివారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో జరిగిన అవకతవకల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించ ఎంపీడీవో జితేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల లిస్టులో ఉన్న అనేక గ్రామాల్లో చాలామంది ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా లేరని నిబంధనలను వెంటనే సడలించాలని ఒకవేళ ఇల్లు కట్టుకొని వారి స్థానంలో పేదలైన అర్హులకు ఇండ్లను కేటాయించాలని గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు.