28-06-2025 10:06:25 PM
లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్
గజ్వేల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని లయన్స్ క్లబ్ అప్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్త ప్రభుత్వ పాఠశాలలో పలు కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మైక్ సెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అప్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి మంచి అభివృద్ధి సాధించాలన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలకు లయన్స్ క్లబ్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లేశం గౌడ్, కోశాధికారి డి సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.